ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

త్వరలో 2020-2021 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ ఆర్ధిక సంవత్సర ముగింపు ప్రభావం భారత ఆటోమొబైల్ మార్కెట్ పై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది వాహనదారులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తమ వాహనాల ధరలను పెంచడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఫోర్డ్ ఇండియా కూడా ఉంది.

ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ కార్ల తయారీదారు ఫోర్డ్ ఇండియా 2021 ఏప్రిల్ నుండి తన కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిసింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఫోర్డ్ కార్ల ధరలు సుమారు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా కంపెనీ ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి వాటిని భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఫోర్డ్ ఫిగో ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 5.64 లక్షల నుండి రూ. 8.19 లక్షల వరకు ఉంది. ఈ ధరతోనే దేశీయ మార్కెట్లో విక్రయాలు కూడా జరుగుతున్నాయి.

ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

అదే విధంగా ఫోర్డ్ ఆస్పైర్ ధర రూ. 7.24 లక్షల నుండి రూ. 8.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అదే సమయంలో, కంపెనీ తన ఫోర్డ్ ఫ్రీస్టైల్ హ్యాచ్‌బ్యాక్‌ను రూ .7.09 లక్షల నుంచి రూ .8.84 లక్షలకు భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

ఇవి మాత్రమే కాకుండా ఫోర్డ్ కంపెనీ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధర ఎక్స్‌షోరూమ్‌ ప్రకారం రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.49 లక్షలు కాగా, ఫోర్డ్ ఎండీవర్ ధర రూ. 29.99 లక్షల నుంచి రూ. 35.45 లక్షల వరకు ఉంది.

ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ వేరియంట్లపై దాదాపు 3 శాతం వరకు పెంచనుంది. అయితే వాటి యొక్క ఖచ్చితమైన ధరల గురించి ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఫోర్డ్ ఇండియా యొక్క ఇండియన్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్ మరియు ఎండీవర్ కార్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

ఫోర్డ్ ఇండియా ఇటీవలే తన ఎకోస్పోర్ట్ యొక్క కొత్త SE వేరియంట్‌ను విడుదల చేసింది. దీనికి రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. దాని పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ధర రూ. 10.49 లక్షలు కాగా, డీజిల్ ఇంజన్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షల వరకు ఉంది.

ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ SE ప్రస్తుత మోడల్ చూడటానికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మాదిరిగానే ఉంది. ఈ వేరియంట్‌ను అమెరికన్ మరియు యూరోపియన్ మార్కెట్లలో కంపెనీ విక్రయిస్తోంది. ఈ కారులో వెనుక భాగంలో ఉంది అదనపు చక్రాలు ఇప్పుడు అందుబాటులో లేదు.

ఫోర్డ్ ఇండియా కార్లపై ధరల పెంపు; ఎప్పటినుంచో తెలుసా ?

ఈ కొత్త కారు యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1.5-లీటర్, 3-సిలిండర్ టివిసిటి పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిడిసి డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. దాని పెట్రోల్ ఇంజన్ 122 బిహెచ్‌పి పవర్ శక్తిని, 149 ఎన్ఎమ్ టార్క్ అందించగా, దాని డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 215 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అయితే పెరగనున్న ధరలు అమ్మకాలపై ఏవిధమైన ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, March 26, 2021, 16:57 [IST]
English summary
Ford India To Increase Price Of Its Cars By 3 Percent From April Details. Read in Telugu.
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+