Just In
- 1 hr ago
పూర్తి చార్జ్పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 5 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్ను గిఫ్ట్గా పొందిన క్రికెటర్ శుబ్మన్ గిల్
- 6 hrs ago
కొత్త ఫోక్స్వ్యాగన్ పోలో ఫేస్లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- News
Covid: భారత్కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు
- Sports
RCB vs RR: శాంసన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తా.. అతడి షాట్లను బాగా ఇష్టపడతా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Finance
భారీ నష్టాల నుండి లాభాల్లోకి మార్కెట్, సెన్సెక్స్ 375 పాయింట్లు జంప్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2021 ట్రైబర్ ఎమ్పివిలో సరికొత్త ఫీచర్లను జోడించిన రెనో - డీటేల్స్
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్ను విడుదల చేసిన తర్వాత, తాజాగా తమ సరికొత్త కాంపాక్ట్ ఎమ్పివి ట్రైబర్లో ఫేస్లిఫ్ట్ మోడల్ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ కొత్త రిఫ్రెష్డ్ రెనో ట్రైబర్ ఎమ్పివి ప్రారంభ ధర రూ.5.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

రెనో ఇండియా తమ ట్రైబర్ ఎమ్పివిని తొలిసారిగా 2019లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత ఇందులో అప్డేటెడ్ వెర్షన్ రావటం ఇదే మొదటిసారి. మునుపటితో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 రెనో ట్రైబర్ ఎమ్పివిలో కంపెనీ అనేక అధనపు ఫీచర్లను జోడించింది. ఆ వివరాలేంటో, ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రెనో ట్రైబర్ ఎమ్పివి ఇప్పటి వరకూ సింగిల్ కలర్ స్కీమ్తో లభించేంది. ఈ కొత్త 2021 ట్రైబర్ ద్వారా కంపెనీ డ్యూయెల్ టోన్ కలర్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు ఐదు డ్యూయల్-టోన్ షేడ్లతో లభిస్తుంది. అన్ని వేరియంట్లు ఇప్పుడు బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్ను కలిగి ఉంటాయి.
MOST READ:కొచ్చిలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ; వివరాలు

కొత్త రెనో 2021 ట్రైబర్ ఎమ్పివిలో డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్లను జోడించడంతో పాటుగా, కంపెనీ ఇందులో ఓ సరికొత్త కలర్ స్కీమ్ను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇిద సీడర్ బ్రౌన్ కొత్త కలర్లో లభిస్తుంది. ఇది కాకుండా, ట్రైబర్ మెటల్ మస్టర్డ్, మూన్లైట్ సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ, ఐస్ కూల్ వైట్ కలర్ స్కీమ్లలో కూడా అందుబాటులో ఉంది.

ఎక్స్టీరియర్లలో చేసిన ఇతర మార్పులలో, సైడ్ మిర్రర్స్ ఇప్పుడు బ్లాక్ కలర్లో లభిస్తాయి. బాడీ కలర్ పెయింట్ స్కీమ్తో సంబంధం లేకుండా రెనో ట్రైబర్ ఎమ్పివి సైడ్ మిర్రర్లు బ్లాక్ కలర్లో ఫినిష్ చేయబడి ఉంటాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో సైడ్ మిర్రర్లపై ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు కూడా లభిస్తాయి.
MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

క్యాబిన్ లోపల చేసిన మార్పులను గమనిస్తే, ఇందులోని స్టీరింగ్ వీల్ ఇప్పుడు ఆడియో కంట్రోల్స్తో పాటుగా ఫోన్ కంట్రోల్ బటన్లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులోని డ్రైవర్ సీటు ఆరు-రకాలు సర్దుబాటు చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. వీటితోపాటుగా కొత్త ట్రైబర్ ఎమ్పివిని డ్యూయెల్ హారన్ ఫీచర్తో అందిస్తున్నారు.

ఈ కొత్త మోడల్లో చేసిన అదనపు మార్పులు చేర్పులు కారణంగా, 2021 ట్రైబర్ ఎమ్పివి ధరలు కూడా మునుపటి కన్నా రూ.15,000 మేర పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.5.30 లక్షల నుండి రూ.7.82 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.
MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

కాగా, కొత్త రెనో ట్రైబర్ ఎమ్పివి ఇంజన్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో ఇదివరకటి 1.0-లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్పి పవర్ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్టి ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.

రెనో ట్రైబర్ ఎమ్పివి ఈ విభాగంలో డాట్సన్ గో ప్లస్ (రూ.4.25 లక్షల నుండి రూ.6.99 లక్షలు)కి దగ్గర పోటీగా ఉంటుంది. ధరల పరంగా చూస్తే, ఇటీవల అప్గ్రేడ్ చేయబడిన మారుతి సుజుకి స్విఫ్ట్ (రూ.5.73-8.41 లక్షలు), ఫోర్డ్ ఫిగో (రూ.5.64-7.09 లక్షలు), హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (రూ.5.19-7.86 లక్షలు) మరియు మారుతి ఎర్టిగా (రూ.7.69-10.47 లక్షలు) వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
MOST READ:చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత