Just In
- 15 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 16 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 18 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే
భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో భాగంగా రోడ్డుప్రమాదాలను తగ్గించడానికి దేశం మొత్తం కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు.
వాహనాలలో ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ కలిగి ఉండాలి. అప్పుడే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ రూల్స్ అన్నింటిని వాహనదారులు పక్కనపెడుతున్నారు. ఈ కారణంగా పోలీసులు వీరికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.
ఇటీవల కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో బైక్ పై వెళ్తున్న ఒక జంట హెల్మెట్ ధరించకపోవడంతో వారికి ట్రాఫిక్ పోలీస్ 500 జరిమానా విధించాడు. ట్రాఫిక్ పోలీస్ విధించిన జరిమానా చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో మహిళ తన మెడలోని మంగళసూత్రం తీసి ఇచ్చింది.
నివేదికల ప్రకారం కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుక్కేరి పట్టణానికి చెందిన 30 సంవత్సరాల భారతి గత వారం తన భర్తతో కలిసి మోటార్ సైకిల్పై మార్కెట్కు వెళ్లారు. వారి వద్ద కేవలం 1800 రూపాయలు ఉండగా, అందులో 1700 రూపాయలకు ఒక మంచం కొన్నారు. మిగిలిన 100 రూపాయలతో టిఫిన్ చేశారు.
మార్కెట్ నుంచి తిరిగి మోటార్ సైకిల్పై ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో ట్రాఫిక్ పోలీస్ ఆపి, వారికి హెల్మెట్ లేకపోవడం వల్ల 500 రూపాయలు ఫైన్ వేసాడు. అయితే తమ వద్ద డబ్బులు లేవని, ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోయిందని ఆ దంపతులు ట్రాఫిక్ పోలీసుకి చెప్పారు. కానీ ఆ పోలీస్ వీరి మాటలు పట్టించుకోలేదు.
చివరికి వారు వాదించి, వాదించి విసిగిపోయి ఆమె తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి పోలీస్ కి ఇచ్చి, ఈ జరిమానా కింద దీన్ని తీసుకోవాలని చెప్పింది. ఆ దంపతులకు మరియు ట్రాఫిక్ పోలీసులకు మధ్య ఈ గొడవ సుమారు రెండు గంటలు కొనసాగింది. ఈ కారణంగా అక్కడ జనం నెమ్మదిగా గుమిగూడారు. ఈ వాగ్వాదం పెద్దది కావడంతో ఒక సీనియర్ అధికారి అక్కడకు వచ్చి కల్పించుకున్నారు. ఆ దంపతులను విడిచి పెట్టాలని ఆ ట్రాఫిక్ పోలీస్కు చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించడానికి ఇంత కఠినంగా ప్రవర్తిస్తారు. కానీ ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఆ వాహనదారులను వదిలివేయడం మంచిది. కానీ వాహనదారులు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. ప్రమాదాలు నివారించడానికి వాహనదారుడు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.