Just In
- 8 min ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 13 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 15 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 16 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ధరల పెంపు బాటలో వరుసగా మరో కంపెనీ
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ ప్రీమియమ్ కార్ల ధరలు పెంచింది. మంచి పాపులర్ అయిన సిటి సెడాన్, బిఆర్-వి మరియు సిఆర్-వి ఎస్యూవీల మీద ధరలను పెంచినట్లు హోండా తెలిపింది.
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ ప్రీమియమ్ కార్ల ధరలు పెంచింది. మంచి పాపులర్ అయిన సిటి సెడాన్, బిఆర్-వి మరియు సిఆర్-వి ఎస్యూవీల మీద ధరలను పెంచినట్లు హోండా ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
జిఎస్టి కౌన్సిల్ మునుపటి వస్తు మరియు సేవల పన్నులో సవరణలు చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు, జిఎస్టిలో మార్పులు చేర్పులు చేసి ప్యాసింజర్ వాహనాల మీద ఉన్న సెస్ను పెంచింది.
జిఎస్టి మండలి నిర్వహించిన ట్యాక్స్ సవరణలో ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఉన్న మిడ్ సైజ్ సెడాన్, లగ్జరీ కార్లు మరియు ఎస్యూవీల మీద 2 నుండి 7 శాతం వరకు జిసిఎస్ సెస్ పెంచింది.
సవరించబడిన జిఎస్టి సెస్ మేరకు హోండా కార్ల మీద రూ. 7,003 ల నుండి రూ. 89,069 ల వరకు ధరలు పెరిగాయి. ధరల పెంపు అనంతరం కొత్త ధరలు సెప్టెంబర్ 11, 2017 నుండి అమల్లోకి వచ్చినట్లు హోండా వివరించింది.
Recommended Video
జిఎస్టి సవరణ తరువాత హోండా చేసిన ధరల సవరణలో హోండా సిటి లోని వివిధ వేరియంట్ల ఆధారంగా రూ. 7,003 ల నుండి 18,791 ల వరకు ధరలు పెరిగాయి.
అదే విధంగా హోండా బిఆర్-వి మీద 12,490 రుపాయల నుండి రూ. 18,242 ల వరకు మరియు హోండా సిఆర్-వి మీద రూ. 75,034 ల నుండి 89,069 ల వరకు ధరలు పెరిగాయి.
పాత పన్ను పద్దతిని పూర్తిగా మార్చేస్తూ, జూలై 1, 2017 నుండి కొత్త పన్ను విధానం జిఎస్టి అమల్లోకి వచ్చింది. జిఎస్టి మేరకు, అత్యంత ఖరీదైన హై ఎండ్ కార్లు, లగ్జరీ మరియు ఎస్యూవీ వెహికల్స్ మీద ట్యాక్స్ తగ్గడంతో వాటి ధరలు భారీగా దిగివచ్చాయి.
అయితే చిన్న మరియు పెద్ద వాహనాల మధ్య ట్యాక్స్ అసమానతలు ఎక్కువగా ఉండటంతో సెప్టెంబర్ 11, 2017 జిఎస్టి సవరణ బిల్లుతో ట్యాక్స్లో మళ్లీ మార్పులు చేసారు. ఈ సవరణకు అనుగుణంగా మిడ్ సైజ్, లగ్జరీ మరియు ఎస్యూవీ వాహనాల మీద ధరలు పెరిగాయి.
జిఎస్టి సవరణ అనంతరం వివిధ కేటగిరీలలో జిఎస్టి ట్యాక్స్ మరియు సెస్ కలుపుకొని మొత్తం ట్యాక్స్లు ఇలా ఉన్నాయి....
- మిడ్ సైజ్ కార్ల మీద - 45 శాతం
- లగ్జరీ కార్ల మీద - 48 శాతం
- ఎస్యూవీ వాహనాల మీద - 50 శాతం.
చిన్న పెట్రోల్ మీద డీజల్ కార్ల మీద అదే విధంగా హైబ్రిడ్ కార్ల మీద ఉన్న మునుపుటి ట్యాక్స్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇది వరకే టయోటా కిర్లోస్కర్ ఇండియా మరియు ఇసుజు మోటార్స్ ఇండియా తమ కార్ల మీద ధరలు పెంచాయి.