Just In
- 15 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 16 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 18 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెహికల్ సెఫ్టీలో కేంద్రం మరో ముందడగు: మరింత సురక్షితమవుతున్న ఇండియన్ కార్లు
ఇక మీదట ప్రతి ఇండియన్ ప్యాసింజర్ కారులో ఐదు అతి ముఖ్యమైన భద్రత ఫీచర్లు తప్పనిసరిగా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
చాలా కార్లలో ఉండాల్సిన సేఫ్టీ ఫీచర్లు అస్సలు ఉండవు. ఇందుకు కారణం ప్రభుత్వం ఆయా కార్ల తయారీ సంస్థలను ప్రశ్నింటచకపోవడం. అయితే కాలం మారింది, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్ ప్రభుత్వం కార్ల తయారీ సంస్థలకు కొన్ని సూచనలు మరియు నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.
ఇక మీదట ప్రతి ఇండియన్ ప్యాసింజర్ కారులో ఐదు అతి ముఖ్యమైన భద్రత ఫీచర్లు తప్పనిసరిగా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ ఎప్పటి నుండి అమలువుతుంది ఏయే ఫీచర్లు ఉండనున్నాయో చూద్దాం రండి.
Recommended Video
భారత్లో జరుగుతున్న ప్రమాదాలు మరియు రోడ్లకు అనుగుణంగా ప్రతి ప్యాసింజర్ కారులో ఉండాల్సిన తప్పనిసరి భద్రతా ఫీచర్లను కేంద్రం ప్రకటించింది. జూలై 1, 2019 నుండి మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి కారులో ఈ ఫీచర్లు ఉండాల్సిందే.
2019 జూలై 1 నుండి ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్, 80కిమీ వేగం దాటితో అప్రమత్తం చేసే సిస్టమ్, రివర్స్ పార్కింగ్ అలర్ట్స్ మరియు అత్యవసర సందర్భాలలో మ్యాన్యువల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను కార్లలో తప్పనిసరి చేసింది.
అదనపు సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేయాలనే అంశం ఎప్పటి నుండో చర్చల్లో ఉంది. అయితే తాజాగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అధికారికంగా దీనిని ఆమోదించారు. ఈ కొత్త నియమం జూలై 1, 2019 నుండి అమలు కానుంది.
కేంద్రం ప్రకటించిన సమయానికి ప్రతి కార్ల తయారీ సంస్థ కూడా ఈ నిర్ణయానికి అనుగుణంగా కార్లను విపణిలోకి విడుదల చేయాలి. ఈ ఫీచర్లు చాలా వరకు కార్లలోని టాప్ ఎండ్ వేరియంట్లు మరియు లగ్జరీ కార్లలో మాత్రమే లభించేవి.
ప్రయాణికులు మరియు పాదచారుల భద్రత దృష్ట్యా కేంద్ర రహదారులు మరియు రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నో ప్రమాదకరమైన రహదారులు ఉన్నాయి.
Trending On DriveSpark Telugu:
మోటార్ వెహికల్ సవరణ బిల్ అంటే ఏమిటి?
మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు!
ఎయిర్బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి?
గణాంకాల ప్రకారం, ఇండియాలో ఏడాదికి 74,000 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మరియు సుమారుగా 1.51 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వివిధ కారణాల రీత్యా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నుప్పటికీ, వాహనాల్లో ఉండాల్సిన కనీస భద్రత ఫీచర్లు ఉంటే ఈ సంఖ్యలు తగ్గేవి.
తప్పని చేసిన భద్రత ఫీచర్లు మరియు వాటి ప్రయోజనాలు...
స్పీడ్ లిమిట్ అలర్ట్
కొత్త కార్లలో అమర్చే స్పీడ్ లిమిట్ ఆడియో సిస్టమ్లో ఆడియో అలర్ట్స్ ఉంటాయి. వెహికల్ 80కిమీల వేగాన్ని అందుకుంటే ఆడియో అలర్ట్స్ చిన్నగా మొదలవుతాయి. అదే వేగం 100కిమీలను చేరితే ఆడియో గట్టిగా మ్రోగుతుంది. ఇక 120కిమీల స్పీడ్ అందుకుంటే ఆడియో అలర్ట్ నాన్-స్టాప్గా మ్రోగుతుంది.
మ్యాన్యువల్ ఓవర్ రైడ్ సిస్టమ్
యాక్సిడెంట్లో కారు ఎలక్ట్రిక్ సిస్టమ్ ఫెయిల్ అయితే, మ్యాన్యువల్ ఓవర్ రైడ్ ద్వారా లోపలి నుండి డోర్లను అన్ లాక్ చేసుకుని బయటపడవచ్చు. ప్రమాదానంతరం ప్రయాణికులు కారులో నుండి బయటకు రాలేక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి వాటిని నివారించేందుకు ఈ ఫీచర్ తప్పని చేశారు.
రివర్స్ పార్కింగ్ అలర్ట్స్
రివర్స్ గేర్లో పార్కింగ్ చేస్తున్నపుడు కారుకు మరియు పాదచారులకు జరిగే ప్రమాదాలను అరికట్టడానికి రివర్స్ పార్కింగ్ అలర్ట్స్ను తప్పనిసరి చేయడం జరిగింది. దీని ద్వారా కారును ఎంత వరకు వెనుక్కు డ్రైవ్ చేయవచ్చు మరియు ఏవైనా అవరోధాలు ఉంటే డ్రైవర్కు సూచిస్తాయి.
కొత్త రూల్ ద్వారా కారుకు ముందు మరియు సైడ్ క్రాష్ టెస్ట్ నిర్వహించి దాని భద్రతను అంచనా వేయనున్నారు. అందుకోసం భారత్ న్యూ వెహికల్ అస్సెస్మెంట్ ప్రోగ్రామ్(BNVSAP) ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న క్రాష్ పరీక్షలకంటే మరింత కఠినంగా ఇక్కడ సేఫ్టీ టెస్ట్ నిర్వహించనున్నారు.
ప్యాసింజర్ కార్లతో పాటు పట్టణ ప్రాంతాల్లో నడిచే చిన్న స్థాయి వాణిజ్య వాహనాలలో రివర్స్ సెన్సార్లు మరియు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా చేసినట్లు కేంద్రం ప్రకటించింది.