Just In
- 4 min ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 2 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 16 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 18 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
Don't Miss
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహీంద్రా ఎక్స్యూవీ500 మరియు టాటా హెక్సా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్
చిన్న కార్ల పరిశ్రమలో తిరుగులేని సక్సెస్ అందుకున్న మారుతి సుజుకి ఇప్పుడు ఖరీదైన వాహన సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది.
చిన్న కార్ల పరిశ్రమలో తిరుగులేని సక్సెస్ అందుకున్న మారుతి సుజుకి ఇప్పుడు ఖరీదైన వాహన సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. యుటిలిటి వెహికల్ శ్రేణిలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టాటా మోటార్స్కు మారుతి గట్టి షాకివ్వనుంది.
ఎస్యూవీ సేల్స్లో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీగా మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్యూవీ మొదటి స్థానంలో నిలిచింది. చిన్న కార్లతో పాటు ఎస్యూవీ సెగ్మెంట్లో కూడా మంచి సక్సెస్ అందుకున్న ఇండో-జపనీస్ సంస్థ మారుతి సుజుకి అతి త్వరలో ఖరీదైన ఎస్యూవీలను ప్రవేశపెట్టనుంది.
Recommended Video
మారుతి సుజుకి ఛైర్మన్ ఓ దిగ్గజ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి 2019 నాటికి ఖరీదైన ప్రీమియమ్ ఎస్యూవీని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు తెలిపాడు.
మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్ సి భార్గవ మాట్లాడుతూ, " పెద్ద ఎస్యూవీ సెగ్మెంట్ మినహాయిస్తే, దాదాపు అన్ని రకాల కార్లను మారుతి ఉత్పత్తి చేస్తోంది. అతి త్వరలో మారుతి ఈ శ్రేణిలోకి కూడా ప్రవేశిస్తోంది. ఖచ్చితమైన తేదీ చెప్పలేను కానీ 2019 చివరి నాటికి తొలి ప్రీమియమ్ ఎస్యూవీ విడుదల ఖచ్చితమని చెప్పుకొచ్చాడు."
Trending On DriveSpark Telugu:
2018లో మరో సంచలనానికి తెర దించుతున్న మారుతి
ప్రీమియమ్ ఎస్యూవీతో పాటు, ఎర్టిగా ఫ్లాట్ఫామ్ ఆధారంగా వైహెచ్బి అనే కోడ్ పేరుతో క్రాసోవర్ యుటిలిటి వెహికల్స్ను అభివృద్ది చేసే ప్రణాళికల్లో ఉంది. అయితే, క్రాసోవర్ మరియు ప్రీమియమ్ ఎస్యూవీలను విడుదల చేసేలోపు మూడు వరుసల సీటింగ్ సామర్థ్యంతో వ్యాగన్ఆర్ ఎమ్పీవీ విడుదల చేయనుంది.
మారుతి సుజుకి నుండి రానున్న ప్రీమియమ్ ఎస్యూవీ ధరల శ్రేణి రూ. 12 నుండి 18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రైజ్ రేంజ్లో విడుదల చేసిన గ్రాండ్ వితారా కు ఆశించిన స్పందన లభించలేదు.
అయితే, మారుతి ప్రవేశపెట్టిన వితారా బ్రిజా సక్సెస్ఫుల్ మోడల్గా నిరూపించుకుంది. ఇదే వ్యాపార ప్రణాళికను కంపెనీ తమ అప్కమింగ్ ప్రీమియమ్ ఎస్యూవీ మీద కూడా ప్రయోగించనుంది.
మారుతి నుండి రానున్న ఖరీదైన ప్రీమియమ్ ఎస్యూవీ ఇండియన్ మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్యూవీ500 మరియు టాటా హెక్సా ఎస్యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
బాలెనో, సియాజ్ వంటి ఖరీదైన మోడళ్ల సక్సెస్ రుచి చూసిన మారుతి సుజుకి ఇప్పుడు ప్రీమియమ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి ఉవ్విళ్లూరుతోంది. మారుతి ప్రీమియమ్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తే, వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికలతో ఖచ్చితంగా ఇండియన్ కొనుగోలుదారులను ఆకట్టుకునే మోడళ్లను విడుదల చేయడం ఖాయం.