Just In
- 15 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 16 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 18 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన న్యాయమూర్తి భార్య, ఎక్కడో తెలుసా..?
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కరోనా నివారించడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కానీ రోజు రోజుకి మరింత ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ నెల గడువు ముగియనున్న లాక్డౌన్ వ్యవధిని మే 3 వరకు పొడిగించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 14 న మీడియా ద్వారా లాక్ డౌన్ పొడిగింపు విషయాన్ని ప్రకటించారు. అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ జిల్లా కోర్టు న్యాయమూర్తి భార్య ప్రధాని మోడీ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్డుపైకి వచ్చిన వీడియో మనం ఇక్కడ చూడవచ్చు.
నివేదికల ప్రకారం మధ్యప్రదేశ్లోని రాయ్పూర్ జిల్లా కోర్టు భార్య కారు నేర్చుకోవడానికి లాక్ డౌన్ సమయంలో రహదారులన్నీ ఖాళీగా ఉండటం వల్ల బయటి వచ్చారు. ఈ వీడియోను టీవీ 9 విడుదల చేసింది.
MOST READ: ఏప్రిల్ 20 తర్వాత బేసి - సరి విధానం, ఎలా ఉంటుందో తెలుసా..?
మధ్యప్రదేశ్ లోని రాయపూర్ జిల్లా కోర్టు న్యాయమూర్తి అనిల్ జైన్. ఆయన భార్య కిరణ్ జైన్. జిల్లా జడ్జి అనిల్ జైన్ కోసం ప్రభుత్వం జారీ చేసిన బొలెరో ఎంవివిని కిరణ్ జైన్ నడిపారు. దీనిని టీవీ 9 సోషల్ మీడియాలో విడుదల చేసింది.
కిరణ్ జైన్ కారు నడుపుతూ కారు వేగాన్ని తగ్గించింది. దీనిని గమనించిన ఒక జర్నలిస్ట్ ఈ సంఘటనను వీడియో తీశారు. వెంటనే న్యాయమూర్తి భార్య కారును రోడ్డు పక్కన ఆపి కారు వెనుక వైపుకు వెళ్ళింది.
MOST READ:జాతీయ రహదారుల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకో తెలుసా..?
లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించడం గురించి జర్నలిస్టు ఆమెను అడిగారు. కానీ దానికి ఆమె సమాధానం ఇవ్వలేదు. కారు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడిగినప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో ఉందని చెప్పారు.
ఈ ప్రాంత ప్రజలు పదేపదే బయటకు వస్తున్నారనే షాకింగ్ న్యూస్ ఇచ్చారు. దీనిపై మీడియా అడిగినప్పుడు జిల్లా జడ్జి అనిల్ జైన్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.
MOST READ: హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులపై భారీ డిస్కౌంట్
కిరణ్ జైన్కు డ్రైవింగ్ చేయడానికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆమె ఎలాంటి మాస్కులు కూడా ధరించలేదని అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు.
కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారికి దేశవ్యాప్తంగా పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు. అంతే కాకుండా వాహన జరిమానాలు విధించడంతో పాటు, వాహనాలను సీజ్ చేస్తున్నారు మరియు వాహనదారులపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. చట్టం ద్వారా రక్షించాల్సిన జిల్లా న్యాయమూర్తి భార్య లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారా అనేది ప్రజల యొక్క ప్రశ్న.
Image Courtesy: TV9 Bharatvarsh/YouTube
MOST READ: కరోనా రోగుల కోసం డ్రైవ్-త్రూ టెస్టింగ్ సౌకర్యం, ఎక్కడో తెలుసా..?