Just In
- 4 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 5 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బైక్ దొంగలించిబడి సంవత్సరం అవుతున్నా.... ఇప్పటికీ ఇ-చలానాలు పొందుతూనే ఉన్న యజమాని!
బైకు దొంగిలించబడటం మరియు తరువాత అదే బైక్ పై ఇ-చలానాలు జరిమానా రూపంలో నిరంతరంగా అందుకోవడం జరగడం ఎంతో వింతగా ఉందిగా, ఈ సంఘటన హైదరాబాద్ కుషాయిగూడలో జరిగింది. దాదాపు సంవత్సరం క్రితం అతని యమహా ఎఫ్ జడ్ బైక్ దొంగిలించబడింది కానీ ఇప్పుడు యజమానికి ఈ-చలానా అందుతున్నాయి.
ఇది పోలీసుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ డేటాబేస్ ను అప్డేట్ చేయడం లేదు. 6 నెలల కాలంలో అతనికి పంపిన ఇ-చలాన్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పట్టుకోవడం కోసం నగరం అంతటా ఉన్న, ట్రాపిక్ కెమెరాల ద్వారా నమోదు జరిగింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇచ్చిన నివేదిక ప్రకారం కుషాయిగూడ నేతాజీ నగర్ నివాసి ఎస్ శేషాద్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన యమహా ఎఫ్ జడ్ మోటార్ సైకిల్ (రిజిస్ట్రేషన్ నెం ఎపి 29ఎఎఫ్9635) దొంగతనం జరిగిందని అతని ఫిర్యాదులో పేర్కొంది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో జనవరి 2018 న కేసు నమోదైంది. అయితే, ఆ బైక్ ఎప్పుడూ దొరకలేదు. అయితే, శేషాద్రి కి తన బైక్ పై రిజిస్టర్ చేసుకున్న నెంబర్ పై మొత్తం ఆరు చలానాలు వచ్చాయీ.
తన బైక్ ను పోగొట్టుకొన్న తరువాత శేషాద్రి దాని గురించి మరిచిపోయాడు అని స్పష్టంగా తెలుస్తుండగా, కానీ అతను ట్రాఫిక్ చలానాలు అందుకోవడంతో నిర్ఘాంతపోయి, చిరాకు పడ్డాడు. ఈ బైక్ పై జారీ చేసిన ఆరు చలాన్లు జూన్ నుంచి డిసెంబర్ 2018 తేదీల జరిగినది.
వీరంతా బైక్ లు రైడ్ చేస్తుండగా హెల్మెట్ ధరించలేదని, కెమెరాలు కూడా ఆ సమయంలో బైక్ పై ఉన్న వారి చిత్రాలు తీశాయి. దీనిపై రాచకొండ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, చలానాల ద్వారా ఫిర్యాదుదారుడికి సాయం చేస్తామని చెప్పారు.
Most Read: తక్కువ ధరతో అమ్మకానికి వచ్చిన అమితాబచ్చన్ బెంజ్ కార్..!
ఈ బైక్ పై మొత్తం రూ. 810 వచ్చింది, అందులో రూ. 600 (హెల్మెట్ ధరించని వారికి రూ. 100), రూ. 35 (యూజర్ ఛార్జ్) కు సంబంధించి యమహా ఎఫ్ జడ్ మొత్తం ఆరు చలాన్లు జారీ చేసింది. ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఈ కేసు ఎఫ్ఐఆర్ వివరాలతో పాటు (65/2018 కుషాయిగూడ పోలీస్ స్టేషన్), ఇలా పేర్కొన్నది:
Most Read: ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !
"జనవరి 2018 లో బైక్ దొంగతనం చేసిన తరువాత కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ ఇక్కడి పోలీసులు రిలాక్స్ గా ఉన్నారు. ఈ ఫిర్యాదు నమోదైన తర్వాత వివిధ ఉల్లంఘనులకు సంబంధించి ఆరు చలాన్లు జారీ చేశారు. వాటి చిత్రాలు కూడా ఉన్నాయి. చలానాలు బైక్ ఉన్నచోటికి చేరకుండా, ఓనర్ ఇల్లుకి చేరాయి."
Most Read: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు వినూత్నంగా వీడ్కోలు శుభాకాంక్షలు చెప్పిన జీప్ ఇండియా!
ఇది ట్రాఫిక్ పోలీస్ డేటాబేస్ అప్ డేట్ నిర్లక్ష్యం కేసు అని తెలుస్తోంది. యజమాని యొక్క వివరాలతో పాటుగా అన్ని వాహనాలను రికార్డ్ చేసే డేటాబేస్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ వ్యక్తికి జరిగిన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది.
ఒక వ్యక్తి తన వాహనాన్ని అమ్మినప్పుడు దాన్ని కొనుగోలుదారుడి పేరుతో బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇది చేయకపోతే, వాహనం ఏదైనా చట్ట విరుద్ధంగా జరుగుతున్నదని (ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఇతర విషయాల మధ్య ఏదైనా నేర కార్యకలాపం)
పోలీసులు తన డేటాబేస్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్లేట్లు మరియు వాహనం యొక్క యజమానిని పరిగణంలోకి తీసుకొంటారు. అందువల్ల, మీరు వాహనాన్ని అమ్మాలనుకొంటే పూర్తి వాహన వివరాలు బదిలీ చేయండి.
Source: Newindianexpress