Just In
- 9 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 10 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 11 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 12 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: మలుపు తిప్పిన స్వప్నిల్ సింగ్.. సన్రైజర్స్ హైదరాబాద్పై ఆర్సీబీ ఘన విజయం!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు
ప్రపంచదేశాలలో కరోనా వైరస్ రోజురోజుకి ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా వాణిజ్య వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతే కాకుండా ఆటో మొబైల్ పరిశ్రమలు కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా ఆటో పరిశ్రమలు ఉత్పత్తి మరియు అమ్మకాలను పూర్తిగా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆటో కంపెనీలు ఎటువంటి ఉత్పత్తి మరియు అమ్మకాలు లేకపోవడం వల్ల వందల కోట్ల నష్టాలు చూస్తున్నాయి. కరోనా వైరస్ కేవలం ప్రజలమీద మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమల మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తోంది.
భారతదేశంలో ప్రస్తుతం రెండవదశ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇది 2020 మే 03 న ముగియనుంది. కానీ వైరస్ అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ఈ గడువు మరింత పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. కాబట్టి వాహన అమ్మకాలు ఈ సమయంలో అసాధ్యమనే చెప్పాలి.
MOST READ:లాక్డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారులలో ఒకటైన మారుతి సుజుకి చరిత్రలో మొట్టమొదటి సారి ఏప్రిల్ నెలలో ఒక్క వాహనం కూడా అమ్మడు పోకపోవడం వల్ల, సున్నా అమ్మకాలను కొనసాగించింది. కేవలం మారుతి మాత్రమే కాకుండా చాల కంపెనీలు కూడా చాలా తక్కువ అమ్మకాలను కలిగి ఉన్నాయి.
ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన కొందరు ఆటో తయారీదారులు ఇప్పుడు లాక్ డౌన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు.
MOST READ:లాక్డౌన్ లో తల్లిని చూడటానికి 480 కి.మీ సైకిల్ పై వచ్చిన కొడుకు, చివరికి ఏమైందంటే
ఆటో పరిశ్రమల్లో వాహనాల ఉత్పత్తికి ప్రస్తుతం పెద్ద విడిభాగాలు లేకపోవడం వల్ల వాహనాల ఉత్పత్తులు పాక్షికంగా నిలివేయబడ్డాయి. ప్రస్తుతం వ్యవసాయ రణగంలో ఉన్న కొన్ని పరిశ్రమలకు మాత్రమే అనుమతి లభించింది. ఇప్పటికే చాల ప్రాంతాలు రెడ్, ఆరంజ్, మరియు గ్రీన్ జోన్ లుగా విభజించారు. ఇది ఆటో ఉత్పత్తులకు సమస్యగా మారింది.
వాహనతయారీ విభాగాలలో అన్ని విడి భాగాలు అందుబాటులో లేనట్లయితే మరియు వాహనాలు విక్రయించబడకపోతే, కంపెనీలు అదనపు ఆర్థిక భారం మోయవలసి వస్తుంది. తర్వాత చాలా కంపెనీలు నష్టాల్లో మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
MOST READ:రిషి కపూర్ మరణం : లాక్డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్
ఆటో పరిశ్రమలు అన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికి, కరోనాకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతున్నాయి. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అవసరమైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయడం ద్వారా వైరస్ నివారణకు పాటుపడుతున్నాయి.