Just In
- 11 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 13 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 15 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 16 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- News ప్రధాని మోడీకి బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ స్పెషల్ థ్యాంక్స్: ఎందుకంటే?
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Movies బెజవాడలో ఈవీఎంల ట్యాంపరింగ్.. క్రికెటర్ శ్రీశాంత్కు సంబంధమేమిటంటే?
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
రెడ్ జోన్లో క్యాబ్ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్, ఎక్కడో తెలుసా !
భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లుగా విభాజించారు. ఈ నాల్గవ దశ లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు కూడా కల్పించబడింది. గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని వాహన సేవలు కూడా కల్పించారు. ఇటీవల కాలంలో రెడ్ జోన్లలో కూడా ఆటోరిక్షాలు మరియు టాక్సీలకు అధికారం ఇచ్చినట్లు రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అంతే కాకుండా గుట్కా, పాన్ మసాలా మరియు పొగాకు ఉత్పత్తుల అమ్మకం కూడా అనుమతించబడింది.
అయితే గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులను తినడం మరియు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వంటివి చేయకూడదని ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించడం చట్టవిరుద్ధం మరియు శిక్షార్హమైనది.
లాక్ డౌన్ యొక్క నాల్గవ దశలో ఓలా మరియు ఉబెర్ టాక్సీలతో సహా ఆటో రిక్షాల నిర్వహణకు రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆపరేషన్ సామాజిక దూరాన్ని నిర్వహించడం మరియు భద్రతా నిబంధనలను పాటించడం వంటి పరిస్థితులతో అనుమతించబడుతుంది.
MOST READ:దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా
రాష్ట్రంలో పబ్లిక్ పార్కులు కూడా తెరవబడతాయి. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం పబ్లిక్ పార్క్ ఉదయం 7 నుండి సాయంత్రం 6.45 వరకు తెరిచి ఉంటుంది. ఈ కార్యకలాపాలన్నీ ఇప్పటికే గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో అనుమతించబడ్డాయి.
రాజస్థాన్లో సోమవారం కరోనా వైరస్ సంక్రమణతో నలుగురు మరణించారు. రాజస్థాన్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 272 కు పెరిగింది. రాజస్థాన్లో కోవిడ్-19 బారిన పడిన వారి మొత్తం సంఖ్య 7,300 కు పెరిగింది.
MOST READ:బిఎమ్డబ్ల్యూ F 900 R & F 900 XR బైక్ టీసర్ వీడియో
దీనిపై రాజస్థాన్ అదనపు ఆరోగ్య కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 272 కేసులు నమోదయ్యాయని, ఈ సంఖ్య ఇప్పుడు 7,300 కు పెరిగిందని చెప్పారు.
పాలిలో 50, నాగౌర్లో 48, జోధ్పూర్లో 47, సికార్లో 44, చురులో 17, జైపూర్లో 13, ఉదయపూర్లో 12 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో 3,077 క్రియాశీల కేసులు నమోదయ్యాయని, 3,559 మందిని నయం చేసి ఆసుపత్రుల నుంచి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో సామజిక దూరం పాటిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
MOST READ:రాళ్ళలో చిక్కుకున్న ఇన్నోవా కారును బయటకు తీసిన మహీంద్రా బొలెరో [వీడియో]