Just In
- 2 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 3 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 5 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Movies Mrunal Thakur గ్లామర్తో అదరగొట్టిన మృణాల్ థాకూర్.. హిరామండి షోలో స్పెషల్ ఎట్రాక్షన్గా
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అటల్ టన్నెల్లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే
సాధారణంగా శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ కొండ ప్రాంతాలలో హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో మంచు భారీగా కురుస్తుంది. ఈ హిమపాతం వల్ల ఇక్కడ నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అంతే కాకుండా అక్కడకు వెళ్లే పర్యాటకులకు కూడా చాలా సమస్యగా ఉంటుంది.
కొన్ని నివేదికల ప్రకారం మనదేశంలో హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా కూడా కొన్ని రోజులుగా ఈ హిమపాతాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో ప్రపంచంలోనే అత్యున్నత పొడవైన సొరంగంమైన అటల్ టన్నెల్ భారత ప్రధానమంత్రి చేత ఓపెన్ చేయబడింది.
ఈ అటల్ టన్నెల్ లో హిమపాతం కారణంగా 82 కార్లు ఇరుక్కుపోయాయి. ఇరుక్కుపోయిన వాహనాలను కులు పోలీసులు అటల్ టన్నెల్ యొక్క సౌత్ పోర్టల్ ప్రాంతం నుండి వాహనాలను తరలించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం శనివారం రాత్రి పొలిసు టీమ్ ఆ ప్రాంతం నుంచి దాదాపు 300 మందికి పైగా పర్యాటకులను రక్షించింది.
MOST READ:2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. భారతీయ రేసర్లు ఏ స్టేజ్లో ఉన్నారో చూడండి
దీని గురించి మనాలికి చెందిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) రామన్ ఘర్సంగి సమాచారాన్ని అందించారు. వాహనాల కదలికను నివారించడానికి మరియు చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి, అని ఆయన అన్నారు.
డిసెంబర్ 29 న హిమాచల్ ప్రదేశ్ లో హిమపాతం ఎక్కువ కావడం వల్ల అక్కడ ఎల్లో అలెర్ట్ విధించినట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అంతే కాకుండా జనవరి 5 న మధ్య మరియు ఎత్తైన పర్వత ప్రాంతాలలో భారీ హిమపాతం ఉంటుందని, జనవరి 3 నుండి 5 వరకు మైదానాలు మరియు లోతట్టు పర్వత ప్రాంతాలలో ఉరుములు మరియు తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
MOST READ:ఒక ఛార్జ్తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు
అటల్ టన్నెల్ ప్రారంభమైనప్పటి నుండి చాలా చర్చలకు దారి తీస్తోంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒకే రోజులో ఈ అటల్ టన్నెల్ ద్వారా 5,450 వాహనాలు ప్రయాణించాయని సమాచారం. అటల్ టన్నెల్ ప్రారంభించినప్పటినుంచి ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి.
అటల్ టన్నెల్ 10,000 అడుగుల ఎత్తులో నిర్మించబడింది, దీని పొడవు 9.02 కిలోమీటర్లు. 3 వేల కార్లు మరియు 1500 ట్రక్కులు ఈ సొరంగ మార్గం గుండా వెళ్లేట్లు అటల్ టన్నెల్ నిర్మించబడింది. కానీ ప్రస్తుతం వాహనాల రాకపోకలు మరీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారింది.
MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?
అటల్ టన్నెల్ చాలా సురక్షితంగా నిర్మించబడింది. ఇందులో ప్రతి 250 మీటర్లకు సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతే కాకుండా ప్రతి 500 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ప్రతి 60 మీటర్లకు సొరంగంలో ఫైర్ హైడ్రాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి.
దీనితో, ప్రతి 1 కిలోమీటరుకు ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఇవ్వబడింది. ఈ సొరంగం మార్గానికి ఇరువైపులా 1 మీటర్ ఫుట్పాత్ ఉంది. దీనితో కలిపి ఇది 10.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ టన్నెల్ నిర్మించడానికి 6 సంవత్సరాల కన్నా తక్కువ సమయం పడుతుందని అంచనా వేయబడింది.
MOST READ:న్యూ ఇయర్లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..
కానీ ఈ సొరంగ మార్గం పూర్తి కావడానికి ఏకంగా 10 సంవత్సరాల సమయం పట్టింది. అటల్ టన్నెల్ లో వేగపరిమితి గంటకు 80 కి.మీ వద్ద ఉంచారు. అటల్ టన్నెల్లో అనేక సౌకర్యాలు ఉన్నాయి, అక్కడికి వచ్చే పర్యాటకులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు, మరికొంతమంది వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కారణంగా ఇటీవల కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.