Just In
- 12 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 14 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 15 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 17 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారత్కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే ?
మారుతి సుజుకి జిమ్ని భారత మార్కెట్లో లాంచ్ చేయబోయే అత్యంత బహుముఖ ఎస్యూవీలలో ఒకటి. ఇది 2020 ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించబడింది. ప్రపంచ మార్కెట్లో ప్రశంసలు అందుకున్న సుజుకి జిమ్మీ మినీ ఎస్యూవీని భారత్లో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
గత ఏడాది మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సివి రామన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ 3 డోర్ల జిమ్మీ ఎస్యువిని భారత్లో విడుదల చేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మారుతి సుజుకి జిమ్నీని 2020 లో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి జిమ్నీ అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్యూవీ.
సివి రామన్కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో 3 డోర్ల మోడల్ను భారతీయ మార్కెట్లో విడుదల చేయలేమని చెప్పారు. దీనిని సిబియు ద్వారా భారత్కు తీసుకురావడంలో అర్థం లేదని తెలిపారు. దీనిని స్థానికంగా తయారు చేయడానికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము అని అన్నారు.
MOST READ:2021 జీప్ కంపాస్ ఫేస్లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్లో విడుదల!
కొన్ని నివేదికల ప్రకారం మారుతి సుజుకి 5 డోర్ల జిమ్మీ ఎస్యూవీని భారత్లో విడుదల చేయనుంది. సుజుకి జిమ్మీ ఎస్యూవీ కోసం భారతీయ వాహన ప్రేమికులు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు.
భారతదేశంలో లాంచ్ చేస్తే, గుర్గావ్ ఆధారిత ప్లాంట్ లో మారుతి సుజుకి జిమ్మీ ఎస్యూవీని ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీ ఎస్యూవీని హెర్టెక్ ప్లాట్ఫామ్ ఆధారంగా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎకో వంటి ఇతర ఎస్యూవీలతో కూడా తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ మినీ-ఎస్యూవీ 2019 సంవత్సరపు ప్రతిష్టాత్మక వరల్డ్ అర్బన్ కారుగా నిలిచింది.
MOST READ:ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?
ఈ జిమ్మీ ఎస్యూవీని భారత్లో విడుదల చేయడంపై కంపెనీ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆటో ఎక్స్పో కస్టమర్ల నుండి సానుకూల స్పందన ఉన్నందున, ఇది భారతదేశంలో ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ మినీ ఎస్యూవీలో 3 లింక్ యాక్సిల్ సస్పెన్షన్ ఉంటుంది. కఠినమైన భూభాగంలో సజావుగా నావిగేట్ చేయడానికి వాహనదారునికి ఇది చాలా సహాయపడుతుంది. ఈ మినీ ఎస్యూవీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ లేదా 4 స్పీడ్ గేర్బాక్స్తో అమర్చబడి ఉంటుంది.
MOST READ:పెరిగిన టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరలు
ఈ మినీ ఎస్యూవీ డీజిల్ మరియు హైబ్రిడ్ ఆప్షన్లలో విడుదల కాలేదు. భారతదేశంలో విడుదల చేస్తే, ఈ జిమ్మీ ఎస్యూవీ 33 సంవత్సరాలుగా దేశంలో అమ్ముడవుతున్న ప్రముఖ జిప్సీ ఎస్యూవీకి వారసురాలు అవుతుంది. ఈ కారు ఎలాంటి రహదారులలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ ఎస్యూవీ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారుని చాలా అనుకూలంగా ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించింది.